వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగార్కర్‌ సెంచరీ- భారత్‌ ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండుతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 170 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండు ఉంచిన 568 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ చివరి రోజు సోమవారంనాడు 397 పరుగులకు అన్నివికెట్లను కోల్పోయింది.

భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌విఫలమైన పరిస్థితిలో అజిత్‌ అగార్కర్‌ సెంచరీ చేయడం చివరి రోజు ఆటవిశేషం. అగార్కర్‌ 109 పరుగులు చేసి టెస్టుల్లో తొలిసెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆరువికెట్లు కోల్పోయి 232 పరుగుల చేసిన భారత్‌ చివరి రోజు సోమవారంవి.వి.యస్‌. లక్ష్మణ్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత ఆశలు వదిలేసుకుంది. లక్ష్మణ్‌ 74పరుగులు చేసి పెవిలియన్‌ దారి పట్టాడు. నెహ్రాతో కలిసి చివరివికెట్‌ భాగస్వామ్యానికి అగార్కర్‌ 63 పరుగులు జోడించి రికార్డు నెలకొల్పాడు. వైట్‌ బౌలింగ్‌లో నెహ్రా ఇచ్చిన క్యాచ్‌ను గ్రాహమ్‌ థోర్ప్‌ పట్టాడు. 19 పరుగులు చేసిన నెహ్రా ఔట్‌ కావడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇంగ్లాండు కెప్టెన్‌ నాజిర్‌ హుస్సేన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ 155 పరుగులు చేశాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లోవీరేంద్ర షెహవాగ్‌ మాత్రమే కాస్తా మెరుగ్గా ఆడి 84 పరుగులు చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూఘోరం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X