స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు
Posted on 05-11-03
హైదరాబాద్: బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా అభివృద్ధి మండలుల స్థానంలో జిల్లా ప్రణాళికాబోర్డులను పునరుద్ధరించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సమావేశానంతరం చెప్పారు. స్థానిక సంస్థలకు మరిన్ని నిధులు, విధులు బదలాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, వ్యవసాయ,విద్యారంగాలకు చెందిన విధులను స్థానిక సంస్థలకు బదలాయిస్తామని, ఈవిషయమై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలను పటిష్టం చేయాలనేదే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications