వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్‌మట్టినీళ్ళు వదలడం లేదు: కర్నాటక సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఆల్‌మట్టిడ్యామ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి నీళ్ళు విడుదల చేయడం లేదనికర్నాటక ముఖ్యమంత్రి ఎన్‌.ధరమ్‌సింగ్‌ శనివారం నాడుస్పష్టం చేశారు. ఆల్‌మట్టి డ్యామ్‌ నుంచి కృష్ణా నీరు విడుదలచేయడానికి కర్నాటక అంగీకరించిందని కేంద్రం చెప్పి ఒక రోజుగడవక ముందే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. నీటి విడుదలకోసం ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి గురించి ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్‌, జలవనరుల శాఖమంత్రి ప్రియరంజన్‌దాస్‌మున్షి తనతో ఫోనులో మాట్లాడారని శనివారం నాడిక్కడఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

అయితే ఈనెల 26నజరిగే శాసనసభలో నీటి విడుదల విషయంలో తమ అభిప్రాయంవెల్లడించనున్నామని ఆయన చెప్పారు. ఏ విధమైన నిర్ణయంతీసుకోనున్నారు అనేది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.కాగా శనివారం నుంచి ఆల్మట్టి నుంచి నీరు విడుదల చేయడానికికర్నాటక ముఖ్యమంత్రి సింగ్‌ హామీ ఇచ్చారని కేంద్రంఅధికారికంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనగా,అది అధికారిక ప్రకటన కాదని సింగ్‌ కొట్టివేశారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖర్‌రెడ్డినాయకత్వంలోని అఖిలపక్షం బృందం బుధవారం నాడు ప్రధానిమన్మోహన్‌సింగ్‌ను కలసి కర్నాటక నుంచి యాభై టిఎంసిలనీటిని విడుదల చేయడానికి జోక్యం చేసుకోవలసిందిగాకోరింది. కాగా నీటి సమస్యను బిజెపి రాజకీయం చేస్తోందనిముఖ్యమంత్రి ధర్‌మసింగ్‌ విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X