కేంద్రమంత్రి సిబు సొరేన్ కోర్టులోలొంగుబాటు
రాష్ట్రంలోనిబంజరు, దేవాదాయ, పోరంబోకు,తదితర భూములను పంపిణీచేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఈభూములను గుర్తించడానికి ఒక కమిటీవేయాలని వామపక్షాల నాయకులుసూచించారు. భూసమస్య పరిష్కారానికిసూచనలు చేయడానికి ప్రభుత్వంకమిటీ వేస్తుందని మంత్రి చెప్పారు.అయితే ఈ కమిటీ కేవలం సూచనలుచేసేదిగానే ఉండకుండా అమలు చేసేదిగాకూడా ఉండాలని వామపక్షాలు అంటున్నాయి.రిటైర్డ్, సీనియర్ప్రభుత్వాధికారులతో ఈ కమిటీనివేస్తామని ధర్మాన ప్రసాదరావుచెప్పారు.భూసమస్యపరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధివుండాలని, కమిటీకి అమలు చేసేఅధికారం కూడా ఉండాలని సిపి ఐ రాష్ట్రకార్యదర్శి, నల్లగొండ లోక్సభసభ్యుడు సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. దేవాదాయ, బంజరుభూముల చట్టాల్లోని లొసుగులను ఆసరాచేసుకొని రెవెన్యూ అధికారులుభూపంపకాన్ని అడ్డుకుంటున్నారని, దీన్నినివారించడానికి చట్టాల్లోని లొసుగులనుసరిదిద్దాలని సిపియం రాష్ట్ర కార్యదర్శిబి.వి. రాఘవులు అన్నారు.శాంతిసాధన కోసం పీపుల్స్వార్ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్రభుత్వం వారు లేవనెత్తినప్రధానమైన భూమి సమస్యనుపరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగానే సోమవారంముఖ్యమంత్రి వామపక్షాల నేతలతోసమావేశమయ్యారు. ఈసమావేశంలో రెవెన్యూ మంత్రిధర్మాన ప్రసాదరావుతో పాటుసురవరం సుధాకర్ రెడ్డి,నారాయణ (సిపి ఐ), కొరటాలసత్యనారాయణ, బి.వి. రాఘవులు(సిపియం) తదితరులుపాల్గొన్నారు.