కెసిఆర్క్షమాపణకు వెంకటస్వామి డిమాండ్
న్యూయార్క్:అమెరికా దక్షిణ ప్రాంతంలో హరికెన్ఇవా న్గా పిలుచుకుంటున్న పెనుతుపానుధాటికి 22మంది మరణించారు. తుపాను తాకిడికిభవంతులు బద్దలై, చెట్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయంఏర్పడి దాదాపు పదిలక్షల మంది అంధకారంలోచిక్కుకు పోయారు. ఫ్లోరిడా, మిస్సిసిపి, అల్బామా,లూసియానా తదితర నగరాలన్నీ గురువారంసముద్రపుటలల తాకిడికి గురయ్యాయి.
ఈ ప్రాంతాలన్నింటినీఅధ్యక్షుడు జార్జిబుష్ పెను విధ్వంసానికిగురైన ప్రాంతాలుగా ప్రకటించారు.ఫ్లోరిడాలో సముద్రపుటలల్లో చిక్కి దాదాపు ఆరుగురుమరణించారు. అల్బామా, లూసియానాలలో పలువురుభవంతుల కింద సజీవ సమాధయ్యారు.ఈ ప్రాం తాలలో గంటకు తొంభై ఐదు కిలోమీటర్లవేగంతో పెనుగాలులు వీస్తున్నాయి.రహదార్లకు అడ్డంగా చెట్లు విరిగి పడి ఉండడంతోసహాయక చర్యలు కూడా మందకొడిగా సాగుతున్నాయి.ఈ పెనుతుపాను వల్ల నాలుగు బిలియన్లనుంచి పది బిలియన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించిఉంటుందని నిపుణులు అంచనా వేశారు.