కాంగ్రెస్,టిఆర్యస్లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ
అనంతపురం:రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి,కాంగ్రెస్కు ఆదరణతగ్గుతున్నదని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శిసురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.ఉప ఎన్నికల ఫలితాలే అందుకునిదర్శనమని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.నక్సలైట్ నేత తరిమెళ్లనాగిరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికిఆయన హాజరయ్యారు.
రాష్ట్రంలోఉప ఎన్నికలు ప్రజలపై అనవసరంగారుద్దబడ్డాయని, అందువల్ల ఈ పరిస్థితిఎదురైందని ఆయన అన్నారు.ఆసిఫ్నగర్లో ఓటమి నుంచి కాంగ్రెస్గుణపాఠం నేర్చుకోవాలని ఆయనఅభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసం పొందేపనులు చేయాలని, ఆత్మావలోకనంచేసుకోవాలని ఆయన అన్నారు.కృష్ణానదిపైపులిచింతల ప్రాజెక్టును తాముసమర్థిస్తామని, అయితే ప్రాధాన్యతవెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాలని ఆయనఅన్నారు. నిపుణుల అభిప్రాయం మేరకేపులిచింతల ప్రాజెక్టు స్థల నిర్ణయంజరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.వెనక్కి తగ్గడం కొంచెం కష్టమైనవిసయమేనని, అయితే పేరుప్రతిష్టలకుపోనవసరం లేదని ఆయన అన్నారు.ఉచిత విద్యుత్ సరఫరాపైరాజీపడకుండా దాని వల్ల విత్తనవ్యాపారులు, కాంట్రాక్టువ్యవసాయదారులు, వ్యవసాయాన్నిఆనందం కోసం చేసేవారు లాభంపొందకుండా చూడాలని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications