మహారాష్ట్రసియం పదవి మాదే: శరద్ పవార్
న్యూఢిల్లీ:మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవితమకే దక్కాలని నేషనలిస్టుకాంగ్రెస్ పార్టీ (యన్సిపి) నేతశరద్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రిపదవి విషయంలో 1999లోఅవలంభించిన విధానాన్నే ఇప్పుడుఅవలంభిస్తామని కాంగ్రెస్ చెప్పిందనిఆయన ఆదివారం విలేకరులతో అన్నారు. దీనిప్రకారం అతి పెద్ద పార్టీ ముఖ్యమంత్రిపదవి చేపడుతుంది. దీంతో ముఖ్యమంత్రిపదవి మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగాఅవతరించిన యన్సిపికిదక్కుతుంది.
శరద్పవార్ ఆదివారంనాడు కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిఅరగంట పేపు చర్చించారు. తమసంఖ్యను ప్రదర్శించడానికి తాముసిద్ధంగా ఉన్నామని, తాము మంచి స్థితిలోఉన్నామని శరద్ పవార్ అన్నారు.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోయన్సిపికి డెబ్బై ఒక్క సీట్లు రాగాకాంగ్రెస్కు అరవై తొమ్మిది సీట్లువచ్చాయి. ఎవరైనా మద్దతు ఇస్తేతాము తీసుకుంటామని ఆయనచెప్పారు.ఇదిలావుంటే,యన్సిపి శాసనసభా పక్షంసమావేశం సోమవారం ముంబాయిలోజరుగుతుంది. ఈ సమావేశంలోశాసనసభా పక్ష నేతనుఎన్నుకోవడంతో పాటు ముఖ్యమంత్రి పదవినిఎవరు చేపడతారనే అంశాన్ని కూడానిర్ణయిస్తారు. ఈ సమావేశానికి కేంద్రపరిశీలకులు తారిక్ అన్వర్, డి.పి. త్రిపాఠీ,ప్రఫుల్ పటేల్ హాజరవుతారు.











Click it and Unblock the Notifications