ఆయుధాలు,హింసలలోనే మాతో తేడా: ఎంఎస్
కరీంనగర్:ఆయుధాలకు, హింసకు స్వస్తి చెప్పాలనిదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు నక్సలైట్లకువిజ్ఞప్తి చేశారు. ఈ రెండు విషయాల్లోనేతమకు, నక్సలైట్లకు మధ్య తేడాఉందని ఆయన ఆదివారం ఇక్కడవిలేకరులతో అన్నారు.
ఆయుధాలకు,హింసకు స్వస్తి చెప్పడానికి నక్సలైట్లుఇష్టపడటం లేదని, ఈ రెండు విషయాల్లోతప్ప కాంగ్రెస్కు, నక్సలైట్లకుమధ్య పెద్దగా తేడా లేదని ఆయనఅన్నారు. ఆ రెండు వీడితే నక్సలైట్లసిద్ధాంతాన్ని అమలు చేయడానికి తాముసిద్ధంగా వున్నామని ఆయన అన్నారు.భూపంపకానికి తాము సిద్ధంగావున్నామని, అవసరమైతే ఇద్దరంమిగులు భూములను గుర్తించి పంచుదామనిఆయన అన్నారు. నక్సలైట్లతో చర్చలవిషయంలో ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డినిర్వహిస్తున్న పాత్రను ఆయనఅభినందించారు. తాను చర్చలకు చొరవచూపించానని, అయితే రాజశేఖర్ రెడ్డి ఈవిషయంలో అభినందనీయమైన పాత్రనిర్వహిస్తున్నారని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications