వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటిటెండర్లపై రాజగోపాల్‌ లేఖాస్త్రం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లరీనోటిఫికేషన్‌లోనూ పొరపాట్లు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ విజయవాడలోక్‌సభ సభ్యుడు లగడపాటిరాజగోపాల్‌ అన్నారు. నీటి పారుదలప్రాజెక్టుల టెండర్ల నోటిఫికేషన్‌లోఅవకతవలు చోటు చేసుకున్నాయని అంటూఆయన ఇంతకు ముందు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికిలేఖ రాశారు.

ఇప్పుడుఏకంగా ఆయన నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖాస్త్రం సంధించారు.టెండర్ల రీనోటిఫికేషన్‌లోనూ అవేపొరపాట్లు జరుగుతున్నాయని, ఈపొరపాట్లను ఎత్తిచూపుతూ మళ్లీ బురదచల్లే అవకాశం ఉన్నదని, పొరపాట్లుచేసి ఇతరుల నుంచి అక్షింతలువేయించుకోవడానికి బదులు మొదట్లోనేజాగ్రత్తగా ఉంటే మంచిదనేఉద్దేశ్యంతో లేఖలు రాశానని ఆయనవివరించారు. తనకు నీటి పారుదలశాఖపై తగిన అవగాహన ఉన్నదని,అందువల్లనే పొరపాట్లు తనకుఅర్థమవుతున్నాయని ఆయనఅన్నారు.

మొదటిసారి ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డికి లేఖ రాయడంపై ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుకె. కేశవరావు తనను వివరణఅడిగారని, తాను కేశవరావుకు లేఖరాస్తున్నానని ఆయన చెప్పారు.ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపుతూ ఇలాగే లేఖలు రాస్తుంటాననిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X