సొంతనియోజవవర్గంలో వైయస్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) బస్సు చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసి బస్సు చార్జీల పెంపు ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. ఆర్డినరీ బస్సు చార్జీ కిలోమీటరుకు 3పైసల చొప్పున, ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సు చార్జీలు కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున పెరిగాయి.
హైటెక్ బస్సు చార్జీలు కిలోమీటరుకు ఐదు పైసలు, గరుడ, వోల్వో బస్సు చార్జీలు పది పైసల చొప్పున పెరిగాయి. ఆర్డినరీ బస్సుల్లో 15 కిలోమీటర్ల వరకు పెంపుదల ఉండదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సిటీ బస్సుల చార్జీలు పెరగలేదు. ప్రస్తుత చార్జీల పెంపువల్ల ఆర్టీసికి అదనంగా 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.
ఆర్టీసి చార్జీలను పెంచక తప్పలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మెదక్లో అన్నారు. నష్టాల నుంచి బయట పడడానికి పెంపు అనివార్యమైందని ఆయన అన్నారు. ఆర్టీసిలోని మౌలిక సమస్యలను పరిష్కరించకుండా చార్జీలు పెంచడం సరైంది కాదని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. చార్జీల పెంపును ఆయన వ్యతిరేకించారు. చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐవైయఫ్) ప్రకటించింది.