వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పియస్ల రెక్కి నిర్వహించిన ఇద్దరు నక్సల్స్ అరెస్టు
హైదరాబాద్: వరంగల్ జిల్లా పస్రా, తాడ్వాయి పోలీసుల స్టేషన్ల రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు మావోయిస్టు నక్సలైట్లను పస్రా పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా ఇద్దరు నక్సలైట్ల విషయం తెలిసింది. అరెస్టయిన మావోయిస్టులు ప్రకాశ్, అనిల్కుమార్ల వద్ద పస్రా, తాడ్వాయి పోలీసు స్టేషన్ల రఫ్ మ్యాప్లున్నాయి. ఈ రెండు పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసుల కదలికల గురించి, వాటి బలం గురించి వీరు ఆరా తీసినట్లు సమాచారం. ముప్పనపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ ఉత్తర తెలంగాణ మావోయిస్టు నాయకుడు గణేశ్కు వ్యక్తిగత కొరియర్ అని, అనిల్కుమార్ స్థానిక దళానికి కొరియర్ అని పోలీసులు చెప్పారు.
ఇదిలా వుంటే, మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలో మూడు టిప్పర్లను దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు బస్స్టాండ్ వద్ద నాలుగు బస్సులను ధ్వంసం చేశారు.
Comments
Story first published: Sunday, March 13, 2005, 23:53 [IST]