వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకరమఠంలో జయేంద్ర సరస్వతి పూజలు

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం శంకరమఠాన్ని సందర్శించారు. శంకరరామన్‌ హత్య కేసులో నిరుడు అక్టోబర్‌లో అరెస్టయిన తర్వాత శంకరాచార్య శంకరమఠాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. శంకరమఠంలో ఆయన దాదాపు గంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించారు. మహాస్వామి చంద్రశేఖర సరస్వతి అధిష్ఠానం ముందు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆయన కల్వాయ్‌ వెళ్లారు.

శంకరరామన్‌ హత్య కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ జయేంద్ర సరస్వతి శంకరమఠంలో ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. అయితే కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయడంతో ఆ షరతు అమలులో ఉండదని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X