శంకరమఠంలో జయేంద్ర సరస్వతి పూజలు

కాంచీపురం: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం శంకరమఠాన్ని సందర్శించారు. శంకరరామన్‌ హత్య కేసులో నిరుడు అక్టోబర్‌లో అరెస్టయిన తర్వాత శంకరాచార్య శంకరమఠాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. శంకరమఠంలో ఆయన దాదాపు గంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించారు. మహాస్వామి చంద్రశేఖర సరస్వతి అధిష్ఠానం ముందు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆయన కల్వాయ్‌ వెళ్లారు.

శంకరరామన్‌ హత్య కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ జయేంద్ర సరస్వతి శంకరమఠంలో ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. అయితే కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయడంతో ఆ షరతు అమలులో ఉండదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+