వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రముఖ మహిళా నక్సలైట్ స్వర్ణక్క లొంగుబాటు
కాకినాడ: ప్రముఖ మహిళా నక్సలైట్ స్వర్ణక్క తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ( ఎస్పి) నవీన్చంద్ ముందు గురువారం లొంగిపోయింది. ఆమె ఇటీవల పోలీసుల చేతికి చిక్కిన సిపిఐ (మావోయిస్టు) ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు దళం అధికార ప్రతినిధి శేషగిరి రావు అలియాస్ గోపన్న భార్య. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా చిలుకూరుగుట్ట గ్రామం. అయితే ఆమె గత 14 ఏళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాలో మావోయిస్టు పార్టీలో పని చేస్తూ వస్తోంది.
ఆమెపై పలు కేసులు ఉన్నట్లు నవీన్చంద్ చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల, కుటుంబంతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో తాను లొంగిపోతున్నట్లు స్వర్ణక్క చెప్పింది. తన గ్రామస్థుల, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సాధారణ జీవితం గడపాలని అనుకుంటున్నట్లు గోపన్న చెప్పిన విషయం తెలిసిందే.
Story first published: Thursday, March 31, 2005, 23:53 [IST]