ఫోకస్ లేనిగంగూలీ మళ్ళీ వాపస్
విశాఖపట్నం:మంగళవారం ఉదయం... వీరేంద్రసెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనిలుధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారతక్రికెట్ అభిమానులకు ఆనందదాయకసమయమది. ప్యాడ్స్ తొడుక్కునిపెవిలియన్లో కూర్చున్న కెప్టెన్ సౌరవ్గంగూలీ మాత్రం టెన్షన్ పడుతున్నాడు.మానసిన వత్తిడితో అతని మొహంఅసహనంగా ఉంది. ఓపెనర్స్ బాగా ఆడుతున్నప్పటికీతాను బాగా ఆడగలనో లేదో నన్నటెన్షన్ అతనిది. అతనుభయపడినట్టే, విమర్శకులు ఊహించినట్టేగంగూలీ తొమ్మిది పరుగులకే పెవిలియన్కుతిరిగివెళ్ళాడు. ఇప్పుడు అతనిలో టెన్షన్కన్పించడం లేదు. భారమంతాదేవుడి మీద వేసినట్టు కన్పిస్తున్నాడు.ఫాంలో లేని ఆటగాళ్లలో సహజంగా ఉండేమానసిక స్ధితి ఇది.
ఆ్రస్టేలియన్గ్రేట్ గ్రెగ్ చాపెల్ గంగూలీ పేరుఎత్తకుండా అతని మానసిక స్ధితినివిశ్లేషించి పరిష్కారాన్ని సూచించారు. ఫోకస్చేయాల్సిన విషయాల మీద కాక అల్పవిషయాల మీద దృష్టి పెట్టడం వల్లనే ఏఆటగాడైనా ఫాంలో లేకుండా పోతాడని ఆయనఅభిప్రాయపడ్డారు. వినూత్న శిక్షణాకార్యక్రమాన్ని ప్రారంభించడానికిముంబై వచ్చిన చాపెల్ ఈ వ్యాఖ్య చేశారు.తాను ఎవరి పేరు చెప్పడం లేదని,తన వ్యాఖ్యను బట్టి ఎవరిని ఉద్దేశించిచేశానో అర్ధం చేసుకోవచ్చని ఆయనఅన్నారు. గతంలో ఒకసారి ఆయనగంగూలీకి టిప్స్ ఇచ్చారు.