వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చౌతాలా ఇళ్ళపై సిబిఐ దాడులు
న్యూఢిల్లీ: సిబిఐ దాడులు గురువారం కూడా కొనసాగాయి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా ఇళ్ళపై సిబిఐ అధికారులు దాడులు జరిపారు. హర్యానాలో జరిగిన జూనియర్ బేసిక్ టీచర్ల నియామకం కుంభకోణంలో వీరిద్దరూ నిందితులు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలో వీరి ఇళ్ళపై ఒకేసారి దాడులు జరిగాయి. ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు ఇళ్ళపై కూడా దాడులు జరిగాయి. రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ గత ఏడాది మేలో చౌతాలాతో సహా 19 మందిపై కేసులు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా నేడు దాడులు జరిగాయి.
Comments
Story first published: Thursday, April 7, 2005, 23:53 [IST]