వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్డీయస్పై ప్రభుత్వం దొడ్డిదారి: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తన బంధువులకు ప్రభుత్వ సొమ్మును కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేవం నాయకులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆర్డియస్పై ముఖ్యమంత్రి తోడల్లుడు సుబ్బారెడ్డి నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని వారు ఆదివారం వ్యతిరేకించారు. ఆర్డీయస్పై నిర్మిస్తున్న మినీ విద్యుత్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు.
ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు వృధా చేస్తోందని వారు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Sunday, April 10, 2005, 23:53 [IST]