73వ ర్యాంక్కు చేరుకున్న సానియా మీర్జా
బెంగుళూర్: హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా ప్రపంచ ర్యాంకింగ్లో 73వ స్థానానికి ఎగబాకింది. 18 ఏళ్ల సానియా హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ను ఈ ఏడాది ప్రారంభంలో గెలుచుకుంది. దీంతో ఆమెకు 75 ర్యాంక్ లభించింది. తాజా డబ్ల్యుటిఎ ర్యాంకింగ్స్ ప్రకారం ఆమెకు 464 పాయింట్లు లభించాయి. జాబితాలో అమెరికాకు చెందిన లిండ్సే డేవన్పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు స్థానాలను వరుసగా రష్యాకు చెందిన మార్యా షరపోవా, ఫ్రాన్స్కు చెందిన అమేలీ మారెస్మో దక్కించుకున్నారు.
ఇదిలా వుంటే, న్యూఢిల్లీలో ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమవుతంది. గాయం కారణంగా సానియా మీర్జా ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా తీసుకునే వరకు ఆతను ఆడేదీ లేనిదీ నిర్ణయించుకోలేనని సానియా అంటోంది. అయితే తాను ఢిల్లీలోనే ఉండి తన తోటి ఆటగాళ్లకు ప్రోత్సాహం అందిస్తానని ఆమె అంటోంది.