మొబిలైజేషన్ అడ్వాన్స్లపై అపోహలు వద్దు: పొన్నాల
అనంతపురం: మొబిలైజేషన్ అడ్వాన్స్లపై అపోహలు వద్దని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు దుర్వినియోగమయ్యే అవకాశాలు లేవని ఆయన విలేకరులతో అన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేయనుండటంతో పొన్నాల లక్ష్మయ్య గురువారం ఉదయం అనంతపురం వచ్చారు.
కాంట్రాక్టర్లు పని చేయకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తామని, మొబిలైజేస్ అడ్వాన్స్లకు బ్యాంకు గ్యారంటీలు ఉన్నాయని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరిన తర్వాత 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఆనవాయితీ అని, ఆనవాయితీ ప్రకారమే ఇచ్చామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 50 కోట్ల రూపాయలు, తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల కోసం 90 కోట్ల రూపాయలు విడుదలు చేసినట్లు ఆయన తెలిపారు. హంద్రీ నీవా ద్వారా 207 నాటికి అనంతపురం, కర్నూలు జిల్లాలకు సాగు నీరందిస్తామని ఆయన చెప్పారు.