వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా తాడిపూడి ఎత్తిపోతలపై చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

తాడేపల్లిగూడెం: గత ప్రాజెక్టులపై జరిగిన బహిరంగ చర్చకు భిన్నంగా తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ ప్రశాంతంగా జరిగింది. తాడిపూడి ఎత్తిపోతల పథకంపై ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ చర్చ జరిగింది. గత ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతికి, సాగునీటి సలహాదారు సీతాపతిరావుకు మధ్య తీవ్ర వాగ్వివాదాలు చెలరేగాయి. అయితే ఈసారి సానా మారుతికి, కాంగ్రెస్‌ ప్రతినిధి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.

చర్చకు ముందు సానా మారుతి, సీతాపతిరావు స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. చర్చ జరుగుతున్న సమయంలో రెండు కాల్వలకు బదులు ఒక్క కాలువ చాలునని నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పోలవరం కుడికాలువ, తాడిపూడి ఎత్తిపోతల కాలువ రెండూ చేపట్టాల్సిన అవసరం లేదని, ఒక కాలువ నిర్మిస్తే సరిపోతుందని సానా మారుతి అన్నారు. కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని సానా మారుతి ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X