వరంగల్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ హతం
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేశవాపూర్ వద్ద ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. వీరు సిపి ఐ (యంయల్) జనశక్తి నక్సలైట్లని పోలీసులు చెప్పారు. వీరిని జనశక్తి జోనల్ కమిటీ నాయకుడు మధు, మరో నక్సలైట్ శ్రీధర్ అలియాస్ శ్రీనివాస్ అని గుర్తించారు. కేశవాపూర్లో స్థానిక నాయకులను మట్టుబెట్టేందుకు యాక్షన్ టీమ్లు వచ్చాయని, ఆ సందర్భంలో వారు పోలీసులకు తారసపడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరిగాయని వరంగల్ పోలీసు సూపరింటిండెంట్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఈ ఇద్దరు నక్సల్స్కు సెంట్రీగా ఉన్న నక్సలైట్ పారిపోయిట్లు చెబుతున్నారు. పోలీసులు ఇద్దరు మహిళా నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులంటున్నారు.
కాగా, మావోయిస్టు నక్సల్స్ అనంతపురం జిల్లాలో అల్లెప్ప అనే కాంగ్రెస్ కార్యకర్తను కాల్చి చంపారు. ముగ్గురు మావోయిస్టులు వచ్చి అల్లెప్పను చంపినట్లు, వీరిలో ఇద్దరిని తాను గుర్తించినట్లు ఆయన భార్య తెలిపింది. అల్లెప్ప 15 యేళ్ల క్రితం నక్సలైట్లతో పని చేసి, ఆ తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్లో చురుగ్గా పనిచేస్తున్నాడు.