వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో నలుగురు కన్నడిగుల మృతి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సదాశివపేట సమీపంలోని కొంకోల్ గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్లోని ఒక పెళ్లికి హాజరై కర్ణాటకలోని తమ స్వస్థలానికి కారులో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారు డ్రైవర్ ఇచ్చిన సిగ్నల్ను పట్టించుకోకుండా లారీ డ్రైవర్ ముందుకు వచ్చాడు. దీంతో ప్రమాదం జరిగింది.
Comments
Story first published: Tuesday, May 24, 2005, 23:53 [IST]