ఐసిసి ట్రోఫీ నిర్వహణకు పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: భారత్లో 2006 ఐసిసి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోపీ టోర్నమెంట్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఐసిసి ఛాంపియన్ ట్రోఫికీ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంనాడు ప్రకటించారు. పన్ను మినహాయింపు ఇస్తే భారత్లో ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణకు బిసిసిఐకి అవకాశం ఇస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసిసి) ఇంతకు ముందు ప్రకటించింది.
ఐసిసి ట్రోఫీకి పన్ను మినహాయిస్తామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించింది. బిసిసిఐకి భారత ప్రభుత్వం పన్ను మినహాయింపును ఈ నెలాఖరులోగా ప్రకటింకపోతే ఐసిసి ట్రోఫీ నిర్వహణ పాకిస్థాన్కు వెళ్లి వుండేది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి ఐ) విజ్ఞప్తిని పరిశీలించిన తర్వాత పన్ను మినహాయింపును ఇస్తూ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications
