వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు: మారెప్ప

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలులో దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర భూగర్భ, ఎత్తిపోతల శాఖ మంత్రి మారెప్ప అధికారులను ఆదేశించారు. అక్రమ భూకబ్జాకు గురైన 12 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆదివారంనాడు సందర్శించారు. ఈ అక్రమ భూకబ్జాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆయన చెప్పారు. ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ భూకబ్జా వ్యవహారంలో చర్యలు తీసుకునే విషయంలో ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని మంత్రి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎవరున్నా, వారు ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో వెనుకంజ వేయబోమని ఆయన చెప్పారు. భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అందుకే తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X