నేరస్థులను ఇంటర్వ్యూ చేస్తే నేరమే: వైయస్
హైదరాబాద్:నేరస్థులను ఇంటర్వ్యూ చేసే మీడియాప్రతినిధులు కూడా నేరస్థులే అవుతారనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు.చట్టవ్యతిరేకమైన చర్యలకుపాల్పడేవారిని ఇంటర్వ్యూ చేయడంచట్టవ్యతిరేకమని చట్టం స్పష్టంచేస్తోందని ఆయన అన్నారు. సమాచారహక్కుపై మంగళవారం జరిగిన ఒకసదస్సులో ఆయన మాట్లాడారు.నక్సలైట్లను ఇంటర్వ్యూ చేసేవారు కూడానేరస్థులవుతారని ఆయన పరోక్షంగాచెప్పారు.
సమాచారహక్కు అంటే అవినీతిని అంతం చేయడానికి,పారదర్శకత పెంచడానికిఉపయోగపడేదని ఆయనఅభిప్రాయపడ్డారు. పత్రికలు చాలా వరకుతప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆయనఅన్నారు. చట్టవ్యతిరేక చర్యలకుపాల్పడేవారిని ఇంటర్వ్యూ చేయడం నేరంకాదా? అని ఆయన ప్రశ్నిస్తూ అలాచేయకూడదని ఆయన మీడియాప్రతినిధులతో అన్నారు.
ప్రైవేట్అన్ ఎయిడెడ్, మైనారిటీవృత్తివిద్యాసంస్థల్లో రిజర్వేషన్లనుఅమలు చేయడానికి వీలుగా రాజ్యాంగసవరణ చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయనతెలిపారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్,మైనారిటీ వృత్తి విద్యాసంస్థ విషయంలోసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్లబలహీనవర్గాలవారు రష్టపోతారనిఆయన అన్నారు.