విద్యుచ్ఛక్తి శాఖ డిఇ ఇళ్లపై ఎసిబి దాడులు
వరంగల్: ఆదయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణపై విద్యుత్ శాఖ డిఇ సత్యనారయణ ఇళ్లపై సోమవారంనాడు అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. సత్యనారాయణ తల్లిగారి ఇంటిపై, అత్తగారి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 43 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బయటపడినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.
సత్యనారాయణకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను తెరవాల్సిన అవసరం ఉందని వారన్నారు. కెనరా బ్యాంకులోనూ, ఆంధ్రా బ్యాంకులోనూ ఈ లాకర్లు ఉన్నాయని వారు చెప్పారు. ఈ లాకర్లను తెరిస్తే గానీ తమ పని పూర్తి కాదని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications