వెనుక కూర్చునే వారికీ హెల్మెట్ నిబంధన
హైదరాబాద్: ఇకపై ద్విచక్ర వాహనాల వెనుక కూర్చునే వారికి కూడా హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ప్రభుత్వ పరిశీలనలో ఉందని నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ ఎకె ఖాన్ మంగళవారం చెప్పారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ నిబంధన ఉందని ఆయన తెలిపారు. హెల్మెట్ నిబంధన వల్ల టూవీలర్ల ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు. టూవీలర్ల వెనుక సీట్ల మీద కూర్చున్న వారే ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications