వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న యస్‌యఫ్‌ఐ విద్యార్థులు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గవర్నర్‌ రామేశ్వర ఠాకూర్‌ కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి భారత విద్యార్థి సమాఖ్య (యస్‌యఫ్‌ఐ) కార్యకర్తలు మంగళవారంనాడు తీవ్ర ప్రయత్నం చేశారు. యస్‌యఫ్‌ఐ కార్యకర్తలు గవర్నర్‌ కాన్వాయ్‌కి అడ్డం పడ్డారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాలను ముట్టడించాలని యస్‌యఫ్‌ఐ ముందే నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళంలో యస్‌యఫ్‌ఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సమయంలో శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన గవర్నర్‌ వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితితో గవర్నర్‌ కాన్వాయ్‌కి భద్రతను కట్టుదిట్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X