పేలిన మరో మందుపాతర: ఎదురుకాల్పులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మరో మందుపాతర పేలింది. అయితే ఈ మందుపాతరలో ఎవరూ గాయపడలేదు. మందుపాతర పేలిన తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సంఘటన కొయ్యూరు మండలం తునుకూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది.
అంతకు ముందు పెదబయలు మండలంలో మందుపాతర పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు పేల్చుస్తున్నారు. ఈ మందుపాతర పేలుళ్లతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications