అరుణ వద్ద నోరు విప్పని జుడాలు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. నయాపూల్ ఆస్పత్రి ఘటనపై ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో చర్చలకు అరుణకుమారి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే జూనియర్ డాక్టర్లు మంత్రి ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు. తనతో మాట్లాడమన్నట్లు జూనియర్ డాక్టర్లు వ్యవహరించారని, తాను చెప్పాల్సిందంతా చెప్పానని ఆమె అన్నారు.
సమ్మె విరమించాలని జూనియర్ డాక్టర్లకు సూచించానని, వారు తనతో మాట్లడడానికి సిద్ధంగా లేరని ఆమె అన్నారు. తాను ఎంత చెప్పినా వారు వినడం లేదని ఆమె అన్నారు. తాను మజ్లీస్ శాసనసభ్యుడు పాషా ఖాద్రీతో కూడా మాట్లాడానని ఆమె చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని ఆమె చెప్పారు. జూనియర్ డాక్టర్లపై దాడి చేసినవారిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications