విద్యార్థినిపై ప్రేమోన్మాది ఘాతుకం
అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రేమోన్మాది ఘోర ఘాతుకానికి పాల్పడ్డాడు. మహాలక్ష్మి అనే పదో తరగతి విద్యార్థినిపై కుళాయప్ప అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని పెదవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో సోమవారం జరిగింది.
మహాలక్ష్మి చేత అతను పురుగుల మందు తాగించాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించలేదనే కోపంతో ఆ ప్రేమోన్మాది ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications