పవన్, నందినిల మధ్య కుదరని రాజీ

Pawan Kalyan
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య నందినిల విడాకులు, మనోవర్తి కేసులు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇరువురి మధ్య రాజీ కుదరకపోవడంతో కోర్టు కేసులను వాయిదా వేసింది. పవన్ తో కలిసే ఉంటానని నందిని చెప్పగా తనకు విడాకులు కావాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు నిర్వహించిన కౌన్సెలింగ్ ఒక కొలిక్కి రాలేదు. పవన్ కళ్యాణ్, నందిని శుక్రవారం నాడు కోర్టుకు హాజరయ్యారు.

నందిని కోర్టు హాజరు కావడానికి ముందు నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టుకు హాజరు కావడానికి తనకు రక్షణ కల్పించాలని నందిని కోరారు. దీంతో ఆమెకు పది మంది పోలీసులను రక్షణగా ఇచ్చారు. రక్షణ మధ్య ఆమె కోర్టు వచ్చిన రెండు నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయమే విశాఖపట్నం వచ్చినప్పటికీ దాదాపు 3 గంటల పాటు బయటనే గడిపాడు. పవన్ కళ్యాణ్ పై నందిని వేసిన బహుభార్యాత్వం కేసును కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పై నందిని శుక్రవారంనాడు హైకోర్టులో బహుభార్యాత్వం కేసుకు సంబంధించి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను హైకోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+