భువనగిరి సభ వద్దు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: తమ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల మాదిరిగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకులు ఈ నెల 24వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరిలో తలపెట్టిన సభను రద్దు చేసుకోవాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు. సీనియర్ నాయకుల తీరు వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత బహిరంగ సభ పెట్టడం పార్టీని వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాను కూడా వ్యతిరేకించినట్లే అవుతుందని ఆయన అన్నారు.

తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. తెరాస నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేసి, యుపిఎ నుంచి వైదొలగడం వల్ల ఏకాభిప్రాయ సాధన మరింత సమస్యగా తయారైందని, వారు యుపిఎలో కొనసాగి ఉంటే ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ కొంత సజావుగా సాగి ఉండేదని ఆయన అన్నారు. సోనియా నిర్ణయానికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరపవచ్చు, తమలో తాము చర్చించుకోవచ్చు కానీ బహిరంగ సభలు పెట్టడం సోనియాను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. తెలంగాణపై సమైక్యాంధ్రలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందని, అన్ని పార్టీల శాసనసభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరమని, తెలుగుదేశం పార్టీ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదని, ఇన్ని వైరుధ్యాల వల్ల తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కష్టంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ స్థితిలో తమ పార్టీ సీనియర్ నేతలు పెట్టే సభ తెలంగాణకు గానీ, పార్టీకి గానీ ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+