వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్ష నేతలను కొంటున్నారు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: ప్రతిపక్షాల నాయకులను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. స్ఠాయిని బట్టి ధర చెల్లించి కాంగ్రెస్ ప్రతిపక్షాల నాయకులను కొంటోందని ఆయన అన్నారు. మీ కోసం యాత్రను ఆయన మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి ప్రారంభించారు. అవినీతి సొమ్ముతో ఏం చేసినా చెల్లుబాటవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదికి 28 లక్షల రూపాయల ఆదాయం చూపిన రాజశేఖర రెడ్డికి ఫ్యాక్టరీలు, పత్రిక ఎలా వచ్చాయని ఆయన అడిగారు.

రాష్ట్రంలో తాను సంపదను సృష్టించానని, దాన్ని పేదలకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఆర్థిక సంస్కరణలు నాయకుల అవినీతికి ఉపయోగపడుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డే నిదర్శనమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X