వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెఎస్ రామారావు కొడుకు పెళ్లి గొడవ

By Staff
|
Google Oneindia TeluguNews

Vallabha
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత కె.యస్. రామారావు కుమారుడి ప్రేమ పెళ్లి వ్యవహారం పోలీసు స్టేషనుకు చేరింది. కె.యస్. రామారావు కుమారుడు వల్లభ, ఆయన ప్రేమికురాలు సౌమ్య మంగళవారం కూకట్ పల్లి పోలీసు స్టేషనులో హాజరయ్యారు. సౌమ్య తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టడంతో వారిద్దరు పోలీసు స్టేషనుకు వచ్చారు. తాము పెళ్లి చేసుకున్నామని వల్లభ, సౌమ్య చెబుతున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టప్రకారమే వల్లభను పెళ్లి చేసుకున్నానని సౌమ్య అంటోంది.

తాము 2007లో పెళ్లి చేసుకున్నామని సౌమ్య చెబుతోంది. తన తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించారని, సౌమ్య తల్లిదండ్రులు కూడా అంగీకరించాలని, అంగీకరిస్తారని ఆశిస్తున్నామని వల్లభ అంటున్నాడు. తమను సంతోషంగా కాపురం చేసుకోనివ్వాలని కూడా అతను కోరుతున్నాడు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సౌమ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము మిస్సింగ్ కేసు నమోదు చేశామని పోలీసు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X