తెలంగాణ రాష్ట్రానికి దళిత సిఎం: కెసీఅర్

తెలంగాణ విషయంలో వైఎస్, చంద్రబాబులు ఇద్దరూ ఒకటేననీ.. వారిని నమ్మే స్థితిలో ఈప్రాంత ప్రజలు లేరని కేసీఆర్ అన్నారు. ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా తెలంగాణపై రిఫరెండమేనని .. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి.. టీఆరెస్ కు ఓటువేయాలని ఆయన పిలుపిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పథకాలకు చెందిన 13వేల 800 కోట్ల నిధులు దారిమళ్లాయని ఆయన విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే...గిరిజనుల ఆరాధ్య దైవమైన కొమరంభీం స్వస్థలం జోడేఘాట్ ను వందకోట్ల రూపాయలతో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తామని కేసీఆర్ హామీఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు , పింఛన్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగాన్ని పారదోలతామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అనుకూల - ప్రతికూల వాదానికి మద్య జరుగుతున్న పోరాటమని.. ఈ పోరులో అంతిమ విజయం తెలంగాణదేనని కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆషామాషీ విజయం ఇవ్వద్దనీ.. అఖండ మెజారిటీతో టీఆరెస్ అభ్యర్ధులను గెలిపించి..ఢిల్లీకి తెలంగాణ దెబ్బ రుచి చూపాలన్నారు .












Click it and Unblock the Notifications