జైపూర్ లో కర్ఫ్యూ, ఆంక్షలు
జైపూర్: జైపూర్ లోని 15 పోలీసు స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం కర్ఫ్యూ విధించారు. నిన్న రాత్రి జైపూర్ వరుస పేలుళ్ళలో 70 మంది మృతి చెందగా, 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్ధాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
కర్ఫ్యూ విధించిన విషయాన్ని జిల్లా కలెక్టర్ అఖిల్ అరోరా, అడిషనల్ డిజిపి కణయ్యలాల్ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో 144 వ సెక్షన్ విధించారు. మృతుల అంతిమ యాత్రలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications