కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదు: వైయస్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించలేకపోతున్నానని ఆయన చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెసుకు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని రాజకీయం చేస్తూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గత నాలుగేళ్లలో కాంగ్రెసు ప్రభుత్వం చేసిన మేళ్లను ఆయన వివరించారు. పరకాలలో రాజీవ్ గాంధీకి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. దేవాదుల పైపులైన్లను పరిశీలించారు.












Click it and Unblock the Notifications