హైదరాబాద్ :ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు దేవాలయ్యాల్లో పూజలు నిర్వహించటంతో ప్రారంభమయ్యాయి.అఖిల భారత మహేష్,కృష్ణ సేనలు వారం రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాన్ని మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ప్రారంభిస్తారు. చిరంజీవికి ధీటుగా మహేష్ బాబు చేత ప్రచారం చేయించేందుకు కాంగ్రేస్ ప్రయత్నం చేస్తూండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది.