వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వెనక్కి తగ్గదు: మన్మోహన్

By Staff
|
Google Oneindia TeluguNews

ManMohan Singh
న్యూఢిల్లీ: కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని భారత్ - అఫ్గనిస్తాన్ దేశాల స్నేహంపై దాడిగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. యుద్ధంతో ధ్వంసమైన అఫ్గనిస్తాన్ పునర్నిర్మాణ కార్యక్రమం నుంచి ఉగ్రవాదుల దాడి వల్ల భారత్ వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. అఫ్గనిస్తాన్ కు ప్రధాని మరో 450 మిలియల్ అమెరికా డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. అఫ్గనిస్తాన్ అధ్కక్షుడు హమీద్ కర్జాయ్ తో మాట్లాడిన అనంతరం ప్రధాని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్జాయ్ తో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అఫ్గనిస్తాన్ భద్రతకు, స్థిరత్వానికి ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదంపై ఉమ్మడిగా, స్థిరచిత్తంతో పోరాడాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఉభయ దేశాల స్నేహానికి ఉగ్రవాదం అడ్డుగోడ కావడాన్ని తాము సహించబోమని ఆయన అన్నారు. కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడిని బట్టి ఉగ్రవాద చర్యలకు సరిహద్దులు లేవనేది అర్థమవుతున్నదని ఆయన అన్నారు.

కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడిని, బెంగుళూర్, అహ్మదాబాదుల్లో బాంబు పేలుళ్లను కర్జాయ్ ఖండించారు. భారత్, అఫ్గనిస్తాన్ ఒకే విధమైన ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు. ప్రజలను రక్షించడం మన మానవులుగా మన బాధ్యత కాబట్టి ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X