విశాఖ మన్యంలో పేలుడు పదార్థాలు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతంలో పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు దొరికాయి. నాలుగు బస్తాల అమ్మోనియం నైట్రేట్, జిలిటెన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఇంత పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు లభించడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో ఈ పేలుడు పదార్ధాల బస్తాలు దొరికాయి.

ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టుల కోసం ఈ పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయా, క్యారీల కోసం సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడడానికి సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+