బెంగుళూర్ లో మరో బాంబు పేలుడు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూర్ లో మరో సారి బాంబు పేలుడు సంభవించింది. నగరంలోని నగరబావిలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం మైసూర్ రోడ్డులో ఉంది. దాన్ని క్రూడ్ బాంబుగా భావిస్తున్నారు. అయితే క్రాకర్స్ పేలుడు అయి వుండవచ్చునని నగర పోలీసు కమీషనర్ శంకర్ బిద్రి చెప్పారు. పేలుడు కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయపడాల్సిన అవసరం లేదని బిద్రీ చెప్పారు. ఈ ప్రాంతంలో పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. గత నెలలో బెంగ ళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు సంభవించిన విషయం తెలిసిందే.
కర్ణాటక రాజధాని బెంగుళూర్ లో జులై 25 న ఏడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో గంటన్నర వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు జిలిటెన్ స్టిక్స్ వాడినట్లు సమాచారం. మడివాలా ప్రాంతంలో జరిగిన పేలుడులో ఒక మహిళ మరణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దాదాపు 14 మంది ఈ పేలుళ్లలో గాయపడినట్లు సమాచారం అందుతోంది. నయాందహళ్లి, మడివాలా, అడుగోడి ప్రాంతాల్లోనూ, మాల్యా ఆస్పత్రి ప్రాంతాల్లో బాంబులు పేలాయి.












Click it and Unblock the Notifications