జయ వ్యాఖ్యలపై అమితాబ్ వివరణ

తాము ఎప్పుడు కూడా మహారాష్ట్ర పట్ల అగౌరవాన్ని ప్రదర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ తెలియకుండా ఆ పని చేసి ఉంటే తాము క్షమాపణ చెప్తామని, తాము విచారం వ్యక్తం చేస్తామని, మనోభావాలు దెబ్బ తిన్నవారి నుంచి క్షమాపణలు కోరుతామని ఆయన అన్నారు. తాను మరాఠీ ప్రయోజనాల కోసం ఎన్నో చేశానని ఆయన చెప్పుకున్నారు. తన మేకప్ మ్యాన్ దీపక్ సావంత్ మరాఠీ వ్యక్తి అని, గత 35 ఏళ్లుగా తనతో ఉంటున్నాడని ఆయన చెప్పారు. దీపక్ సావంత్ మరాఠీలో నిర్మించిన రెండు సినిమాలకు తనతో పాటు జయ పనిచేసినట్లు ఆయన తెలిపారు. బోజ్ పురిలో కూడా అతను రెండు సినిమాలు తీశాడని, డబ్బులు తీసుకోకుండా తాను పనిచేశానని అమితాబ్ చెప్పారు.
మరాఠీ చిత్రం శ్వాస్ ఆస్కార్స్ కు ఎంపికైనప్పుడు లాస్ ఏంజెల్స్ కు వెళ్లడానికి నిర్మాతల వద్ద డబ్బు లేకపోతే తాను 11 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన ప్రొడక్షన్ కంపెనీ ఎబి కార్పోరేషన్ ద్వారా మరాఠీలను ప్రోత్సహిస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అటువంటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జయ రూపకల్పన చేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications