పేదరికం అడ్డు రావద్దు: సోనియా

Sonia Gandhi
కడప: పేద విద్యార్థులందరికీ ఉన్నత సాంకేతిక విద్య అందుబాటులోకి రావాలని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ అన్నారు. పేదరికమో, గ్రామీణ వాతావరణమో ఉన్నత సాంకేతిక విద్య అభ్యాసానికి అడ్డం రాకూడదని ఆమె అన్నారు. కడపి జిల్లా ఇడుపులపాయలో ఆమె త్రిపుల్ ఐటిని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ నాలెడ్జి పైలాన్ ను కూడా ప్రారంభించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధిస్తోందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 14 ఆధునిక విద్యాసంస్థలను నెలకొల్పుతోందని ఆయన అన్నారు.

రాజీవ్ గాంధీ శాస్త్రీయ, సాంకేతిక రంగాల అభివృద్ధికి కలలు కన్నారని. ఐటి వంటి ఆధునికసాంకేతిక విద్యలు రాజీవ్ దృక్పథం వల్లనే అందుబాటులోకి వచ్చాయని ఆమె అన్నారు. రాజీవ్ దృక్పథం, అంకిత భావం ఇవాళ ఫలితాలను అందిస్తోందని ఆమెఅన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద యెత్తున పెరిగాయని ఆమె చెప్పారు. సామాజిక సాధికారతకు విద్య అత్యవసరమని ఆమె అన్నారు.

రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఏర్పాటు సందర్భంగా తాను ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టం కట్టడమే త్రిపుల్ ఐటిల స్థాపన లక్ష్యమని ఆయన అన్నారు. ఐటి అభివృద్ధి రాజీవ్ గాంధీ చలువేనని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ఐటి మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+