ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

హైదరాబాద్: హైదరాబాదులోని గణేష్ నిమజ్జనం సోమవారం ఉదయం ముగిసింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనంతో ఈ కార్యక్రమం ముగిసింది. అత్యంత ఎత్తయిన ఈ విగ్రహ నిమజ్జనం సోమవారం ఉదయం జరిగింది. జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్రేన్ సాయంతో ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగరులో నిమజ్జనం చేశారు. ఆదివారం రాత్రి ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ విగ్రహం నిమజ్జనంతో గణేష నిమజ్జన కార్యక్రమం ముగిసింది.

ఆదివారంనాడు హైదరాబాద్, సికింద్రబాద్ జంటనగరాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం పెద్ద యెత్తున జరిగింది. హుస్సేన్ సాగరుకు గణేష్ విగ్రహాలు ఒక్కటొక్కటే తరలి వచ్చాయి. భక్తులు పెద్ద యెత్తున వాటిని చూడడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+