మా బలం చూసి భయపడే...: వైయస్

తొమ్మిదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని, నాలుగున్నర ఏళ్ల పాలనతో తాము విశ్వసనీయతను పెంచుకున్నామని, అది వారి బలహీనత ఇది తమ బలమని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు తమంతట తాము పోటీ చేసి గెలిచే సత్తా లేదు కాబట్టి పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయని, కాంగ్రెస్ బలం చూసి ఆ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము ఎవరినీ తక్కువ చేయడం లేదని, అలా తక్కువ చేసే లక్షణం కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు తాము చేసినంత మేలు ఎవరూ చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications