నా మీది కోపం కుప్పం మీద: బాబు

Chandrababu Naidu
చిత్తూరు: తనపై కోపంతోనే తన కుప్పం నియోజకవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆయన సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. రామకుప్పం మసీదులో ఆయన ప్రార్థనలు చేశారు. రాజకీయాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం అవసరమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నిరుద్యోగులకు వేయి రూపాయల చొప్పున భృతి ఇస్తామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేదల గృహాలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదల కొత్త ఇళ్లకు లక్ష రూపాయలేసి ఇస్తామని ఆయన చెప్పారు. రామకుప్పం వద్ద చంద్రబాబు కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఢీకొన్నాయి.

అమెరికా ఒత్తిళ్లకు లొంగి అణు ఒప్పందం చేసుకుంటే దేశానికి ప్రమాదమని, అమెరికా నిర్దేశం ప్రకారం మనం నడుచుకోవాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా ప్రజలను మోసం చేసి, తప్పుడు సమాచారం ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. దేశప్రయోజనాలను కాలరాసే విధంగా ఒప్పందం చేసుకోవడం గర్హనీయమని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఫణంగా పెడుతోందని ఆయన అన్నారు. ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో అవినీతిలో ఎవరూ పోటీ పడలేరని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం నాలుగు కిలోల బియ్యం మాత్రమేనని, అది ఎన్ని రోజులకో సరిపోదని, ధరలు పెరగడంతో మిగతా రోజులకు బియ్యం కొనలేదని స్థితిలో ప్రజలున్నారని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎరువులున్నా రైతులకు అందించే స్థితిలో లేదని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+