సోనియాతో వైయస్ భేటీ

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన సోనియాతో మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుల అవసరాలపై, అందుకు గల అవకాశాలపై సోనియా రాజశేఖర రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే, చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని వైయస్ సోనియాను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చేనేత కార్మికులపై 475 కోట్ల రూపాయల రుణభారం ఉందని, వాటిని రద్దు చేస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలను నిరోధించవచ్చునని ఆయన సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, కేంద్ర మానవ వనరుల మంత్రి అర్జున్ సింగ్ ను వైయస్ రాజశేఖర రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం విస్తరింపజేయాలని రాజశేఖర రెడ్డి అర్జున్ సింగ్ ను కోరినట్లు తెలుస్తోంది. మైన్స్ యూనివర్శిటీని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన అర్జున్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+