గుడిలో తొక్కిసలాట: మృతులు 179 మంది

Chamudeswari Temple
జోథ్ పూర్: రాజస్థాన్ లో జోథ్ పూర్ సమీపంలో గల చాముండేశ్వరీ ఆలయంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 చేరుకుంది. మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ సంఖ్య 200 దాటవచ్చునని అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన భక్తుల మధ్య తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో 15 నుంచి 20 మందిదాకా చనిపోగా మహాత్మాగాంధీ, మధుర దాస్, సిటీ ఆస్పత్రుల్లో మిగతా వారు మరణించారు. గోడ కూలడం వల్లనే భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆలయంలోకి వెళ్తున్న భక్తులను వివిఐపిల కోసం ఆపడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే దీన్ని అధికార వర్గాలు ఖండిస్తున్నాయి. ఆలయం సమీపంలోని బారికేడ్లు విరిగిపోవడంతో గందరగోళం చెలరేగి తొక్కిసలాట ప్రారంభమైందని ఆ వర్గాలంటున్నాయి.

సంఘటనా స్థలం హృదయవిదారకంగా ఉంది. భక్తుల హాహాకారాలతో ఆ ప్రదేశం మారుమ్రోగింది. స్థానిక ఆస్పత్రుల్లో శవాలు పడేసి ఉన్నాయి. ఈ సంఘటనపై దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ హోం మంత్రి గలాబ్ సాంద్ కటారియా విలేకరులతో అన్నారు. జోథ్ పూర్ సమీపంలో ని మెహ్రాఘర్ లో బాంబు ఉన్నట్లు ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, దీంతో తొక్కిసలాట జరిగిందని తొలుత టీవీ వార్తాకథనాలు వెలువడ్డాయి. చాముండీశ్వరీ ఆలయానికి పెద్ద యెత్తున భక్తులు వచ్చారు. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయరాజే సింథియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+