పెద్దల కోసం కోస్తా కారిడార్: చిరు

తమ పార్టీ కార్యకర్తల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. కొంత మంది ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఓటు హక్కు కోసం శాంతియుతంగా పోరాడాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజారాజ్యం పార్టీ విధివిధానాలను ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా వెల్లడించారు. గ్రామస్వరాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజలకు నిధులు, విధులు ఇస్తామని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థపై కూడా తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని, విద్యలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications