దీపావళి తర్వాత మళ్లీ చిరు యాత్ర: మిత్రా

Chiranjeevi
విశాఖపట్నం: దీపావళి పర్వదినం తర్వాత తమ పార్టీ అధినేత చిరంజీవి రెండో విడత పర్యటన జరుగుతుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. తర్వలో ఆ పర్యటన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర రద్దు కాలేదని, వాయిదా మాత్రమే పడిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గొంతు దెబ్బ తిని, ఆరోగ్యం చెడిపోవడంతో చిరంజీవి విశాఖపట్నం జిల్లా పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్న విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలును కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

తాము అన్ని విషయాలపై తమ విధివిధానాలను ప్రకటించామని ఆయన చెప్పారు. పార్టీ కార్యాలయాల్లో కూర్చుని కాకుండా ప్రజల మధ్యకు వచ్చి వాటిని ప్రకటించామని ఆయన చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సహించబోమని ఆయన చెప్పారు. కోస్తా కారిడార్ ను వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. సెజ్ లపైనే కాకుండా మహిళలపై, విద్యపై, గ్రామీణాభివృద్ధిపై, అధికార వికేంద్రీకరణపై తాము అ్ని విషయాలను స్పష్టం చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+